ఇయ్యాల్టి నుంచే పార్లమెంట్ సమావేశాలు

ఇయ్యాల్టి నుంచే పార్లమెంట్ సమావేశాలు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. మొత్తం 23 రోజులు సెషన్ సాగనుండగా.. 17 రోజులు ఉభయ సభలు భేటీ కానున్నాయి. అయితే, ఈసారి వర్షాకాల సమావేశాలు పాత పార్లమెంట్ భవనంలో మొదలై, కొత్త భవనంలో ముగుస్తాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉభయ సభల్లో మొత్తం 37 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. 

ఇందులో 8 బిల్లులపై చర్చించి పాస్ చేయాల్సి ఉంది. మిగిలిన 21 బిల్లులు ప్రవేశపెట్టడం కోసం లిస్ట్ చేస్తారు. ఈ సెషన్ లోనే యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.