
రియాద్: జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ(డీపీఏపీ) చీఫ్ గులాం నబీ ఆజాద్ అస్వస్థతకు గురయ్యారు. ఎంపీ బృందంతో సౌదీ పర్యటనలో ఉన్న ఆయన అనారోగ్యం బారిన పడటంతో వెంటనే ఆసుపత్రిలో చేరారు. అందుకు సంబంధించిన వివరాలను బీజేపీ ఎంపీ, ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న బైజయంత్ పాండా వెల్లడించారు.
బీజేపీ నేత బైజయంత్ పాండా నేతృత్వంలోని ఎంపీల బృందం గల్ఫ్ దేశాల్లో పర్యటిస్తోంది. ఇందులో ఆజాద్ కూడా ఉన్నారు. ఈ బృందం సౌదీఅరేబియాలో పర్యటిస్తున్న సమయంలో ఆజాద్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను రియాద్లోని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పాండా ట్వీట్ చేశారు.