పర్ణశాల హుండీ ఆదాయం రూ.7.35 లక్షలు

పర్ణశాల హుండీ ఆదాయం రూ.7.35 లక్షలు

భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం అనుబంధంగా ఉండే దుమ్ముగూడెం మండలం పర్ణశాల రామాలయం హుండీని శుక్రవారం లెక్కించారు. రూ.7,35,728 ఆదాయం వచ్చింది. హుండీ లెక్కింపులో ఈవో రమాదేవి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి మూలవరులను స్వర్ణ కవచాలతో అలంకరించారు. 

స్వర్ణ కవచధారి రామయ్యకు విశేష హారతులు సమర్పించారు. లక్ష్మీతాయారు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. లక్ష్మీ అష్టోత్తర శతనామార్చన, కుంకుమ పూజ, విష్ణు సహస్రనామ పారాయణం జరిగాయి. బేడా మండపంలో సీతారాములకు నిత్య కల్యాణం జరిపించారు. సాయంత్రం దర్బారు సేవ జరగగా, సీతారామయ్యకు సంధ్యాహారతి సమర్పించారు.