బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్పై దాడి : దుబ్బాకలో ఉద్రికత్త

బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్పై దాడి : దుబ్బాకలో ఉద్రికత్త

సిద్దిపేట జిల్లా : దుబ్బాక పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ పెద్ది నవీన్ పై దాడి జరిగింది. ఒంటరిగా ఉన్న సమయంలో కొంతమంది వ్యక్తులు వచ్చి.. నవీన్ పై దాడి చేశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలే దాడి చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 

బీజేపీ పార్టీ ఆఫీసు నుంచి నవీన్ ను బలవంతంగా బయటకు లాక్కొచ్చి.. ఇష్టం వచ్చినట్లు కొట్టారని తెలుస్తోంది. పోలీస్ స్టేషషన్​లో కుప్పకూలిపోయిన నవీన్ ను బీజేపీ కార్యకర్తలు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న నవీన్ ను వైద్యుల సూచన మేరకు సిద్దిపేట హాస్పితటల్ కు తీసుకెళ్లారు.