 
                                    - శామీర్పేట నుంచి శంషాబాద్కు క్యాబ్బుక్ చేసుకున్న
- ప్యాసింజర్కు షాక్ సర్జ్ప్రైసింగ్ పేరుతో క్యాబ్ బుకింగ్ యాప్స్ దోపిడీ
- వర్షాలు పడినా, ట్రాఫిక్జామ్స్ఉన్నా అడ్డగోలు ధరలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్పరిధిలో క్యాబ్ బుకింగ్ యాప్స్ ఇష్టమున్నట్టు దోచుకుంటున్నాయి. ముఖ్యంగా సర్జ్ప్రైసింగ్పేరుతో రకరకాల కారణాలు చెప్పి ప్రయాణికుల అవసరాలను క్యాష్ చేసుకుంటున్నాయి. వర్షాలు కురిసినా, ట్రాఫిక్ రద్దీ ఉన్నా, పీక్ అవర్స్లో సర్జ్ ప్రైసింగ్పేరుతో సాధారణ చార్జీల కంటే డబుల్ రేట్లు వసూలు చేస్తున్నాయి. పండుగలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో అయితే ఈ దోపిడీ మరీ ఎక్కువగా ఉంటున్నది. ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి సంస్థలు ఈ దోపిడీకి పాల్పడుతున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఈ సంస్థలు వసూలు చేసే చార్జీలతో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ, ముంబయి, పాట్నా, చెన్నై వంటి ప్రాంతాలకు విమానాల్లో వెళ్లి రావొచ్చని అంటున్నారు. 
ఏం జరిగిందంటే..
హైదరాబాద్లోని శామీర్పేటకు చెందిన ఓ యువకుడు సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు శంషాబాద్ఎయిర్పోర్ట్వెళ్లేందుకు ఊబర్బుక్చేయడానికి ప్రయత్నించాడు. అయితే, అందులో ఏకంగా రూ.5 వేలు చూపించడంతో అవాక్కయ్యాడు. లేటయితే ఫ్లైట్మిస్సయ్యే అవకాశం ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రూ.5 వేలు చెల్లించాడు. తర్వాత ఈ వ్యవహారాన్నంతా సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. సాధారణంగా రాత్రి వేళ శామీర్పేట్నుంచి ఎయిర్పోర్ట్కు రూ.2 వేల వరకు తీసుకుంటున్నారు. అయితే, రూట్మార్పులు, ట్రాఫిక్ సమస్యల వంటి సాకులతో క్యాబ్ సర్వీస్సంస్థలు ధరలను అడ్డగోలుగా పెంచుతున్నాయి. క్యాబ్ యాప్లు అనుసరిస్తున్న సర్జ్ ప్రైసింగ్ విధానం ఈ దోపిడీకి మరింత ఊతమిస్తున్నది. తెల్లవారుజామున విమానం ఎక్కాల్సిన వారి బలహీనతను ఆసరా చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారని, యాప్లు తమ సర్జ్ ప్రైసింగ్ను వెంటనే సరిదిద్దాలని ఆన్లైన్లో డిమాండ్లు వస్తున్నాయి.

 
         
                     
                     
                    