ఫుట్ ఓవర్ బ్రిడ్జి రిపేర్లతో ప్రయాణికుల పాట్లు

ఫుట్ ఓవర్ బ్రిడ్జి రిపేర్లతో ప్రయాణికుల పాట్లు

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ లో ఒకటో ఫ్లాట్ ఫారం వైపు కొనసాగుతున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి రిపేర్లతో  ప్రయాణికులకు ఇబ్బందులు పడుతున్నారు. పనుల కారణంగా ఆ వంతెన తాత్కాలికంగా మూసివేయడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రెండో ఫ్లాట్ ఫారం వైపుకు పట్టాలు దాటాల్సి వస్తోంది. 

రాఖీ పండగ నేపథ్యంలో సిర్పూర్ కాగజ్ నగర్, ఆసిఫాబాద్ ప్రాంతాల వారు సైతం బెల్లంపల్లి స్టేషన్​కే వస్తుండటంతో రెండ్రోజులుగా రద్దీ విపరీతంగా కనిపిస్తోంది. గత్యంతరం లేక ఒక ఫ్లాట్​ఫాం నుంచి మరో ఫ్లాట్​ఫాంకు పట్టాల పైనుంచే దాటుతున్నారు. ఇప్పటికైనా రైల్వే అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.