యూపీలో రైలు ప్రమాదం.. పటాల్కోట్ ఎక్స్ప్రెస్లో చెలరేగిన మంటలు..

యూపీలో రైలు ప్రమాదం.. పటాల్కోట్ ఎక్స్ప్రెస్లో చెలరేగిన మంటలు..

ఉత్తర ప్రదేశ్ లో రైలు ప్రమాదం జరిగింది. పటాల్ కోట్ ఎక్స్ ప్రెస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. భారీగా మంటలు ఎగిసి పడటంతో రెండు బోగీల్లో దట్టమైన మంటలు, పొగ వ్యాపించారు. అగ్ని మాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పేందుకు ప్రయత్నించాయి.. అయినా మంటలు అదుపులోకి రాలేదు.  దీంతో రెండు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. బుధవారం మధ్యాహ్నం ( అక్టోబర్25) అగ్రా సమీపంలోని బదాయ్ రైల్వే స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.