ఉత్తర ప్రదేశ్ లో రైలు ప్రమాదం జరిగింది. పటాల్ కోట్ ఎక్స్ ప్రెస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. భారీగా మంటలు ఎగిసి పడటంతో రెండు బోగీల్లో దట్టమైన మంటలు, పొగ వ్యాపించారు. అగ్ని మాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పేందుకు ప్రయత్నించాయి.. అయినా మంటలు అదుపులోకి రాలేదు. దీంతో రెండు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. బుధవారం మధ్యాహ్నం ( అక్టోబర్25) అగ్రా సమీపంలోని బదాయ్ రైల్వే స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
आगरा में चलती ट्रेन में लगी आग. एक्सप्रेस ट्रेन के दो डिब्बों में लगी आग. थाना मलपुरा क्षेत्र के भाड़ई रेलवे स्टेशन के पास लगी आग. @RailMinIndia pic.twitter.com/DtFSKU00iF
— Himanshu Tripathi (@thimanshut) October 25, 2023
పటాల్ కోట్ ఎక్స్ ప్రెస్ రైలు పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ కంటోన్మెంట్ నుంచి మధ్యప్రదేశ్ లోని సియోని స్టేషన్ల మధ్య నడుస్తోంది. యూపీలోని అగ్రా, థోల్ పూర్ మధ్య పటాల్ కోట్ ఎక్స్ ప్రెస్ లో ఒక్కసారిగి మంటలు చెలరేగాయి. GS కోచ్ , 4వ కోచ్ లో ఇంజన్ నుంచి పొగలు రావడంతో రైలు నిలిపివేశారు. ఇతర బోగీలకు మంటలు వ్యాపించకుండా బోగీల లింక్ ను వేరు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఇండియన్ రైల్వే అధికారులు తెలిపారు.