ఇండస్ట్రీ ఏరియాల్లో వలస కూలీల నేరాలపై ఫోకస్

ఇండస్ట్రీ ఏరియాల్లో వలస కూలీల నేరాలపై ఫోకస్

రామచంద్రాపురం/పటాన్​చెరు, వెలుగు: ఇండస్ట్రియల్​ ఏరియాల్లో పని చేసేందుకు వలస వస్తున్న నార్త్​ ఇండియా కూలీలు ఎక్కువగా నేరాలు చేస్తున్నారని, అలాంటి వారిపై ప్రత్యేక దృష్టి పెట్టామని చార్మినార్​ జోన్​ ఐజీ వి.సత్యనారాయణ తెలిపారు. పటాన్​చెరు వంటి పారిశ్రామిక ప్రాంతంలో ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్పారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పోలీస్​స్టేషన్​ను ఐజీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది జరిగిన 18 రాబరీ కేసుల్లో 17 కేసులను ఛేదించామన్నారు. ఆన్​లైన్​ ఫ్రాడ్స్, సైబర్  క్రైమ్స్​ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొత్తగా రిక్రూట్​ అయిన కానిస్టేబుళ్లు, ఎస్సైలకు ట్రైనింగ్  ఇచ్చి నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేశ్, పటాన్​చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. 

43 మందిపై ఎఫ్ఐఆర్

పటాన్​చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి క్యాంప్​ ఆఫీస్​పై గురువారం జరిగిన దాడి ఘటనలో 43 మందిపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేసినట్లు ఐజీ సత్యనారాయణ తెలిపారు. విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఘటనా స్థలంలో లా అండ్ ఆర్డర్​ కాపాడడంలో పోలీస్​ సిబ్బంది సమర్థవంతంగా పని చేశారన్నారు.