- ఒకరి అరెస్ట్..10 కిలోల సరుకు స్వాధీనం
జీడిమెట్ల, వెలుగు: జోమాటో బ్యాగ్లో గంజాయిని పెట్టుకుని తిరుగుతున్న వ్యక్తిని పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాం రాష్ట్రానికి చెందిన దీపాంకర్ మేదీ(25) సిటీకి వచ్చి రాయదుర్గంలోని మాధవనగర్లో ఉంటూ కూలీగా పనిచేస్తున్నాడు. దీపాంకర్ గురువారం జోమాటో బ్యాగ్తో గుండ్లపోచంపల్లిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు అతడి బ్యాగ్ను తనిఖీ చేయగా.. 10 కిలోల గంజాయి బయటపడింది. గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు దీపాంకర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.