బీఆర్ఎస్, బీజేపీలను ప్రజా కోర్టులో నిలబెడతాం: పటేల్ ప్రభాకర్ రెడ్డి

బీఆర్ఎస్, బీజేపీలను ప్రజా కోర్టులో నిలబెడతాం: పటేల్ ప్రభాకర్ రెడ్డి

గద్వాల, వెలుగు: బీఆర్ఎస్, బీజేపీలను ప్రజాకోర్టులో నిలబెడతామని డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఆదివారం పార్టీ ఆఫీసులో బీఆర్ఎస్, బీజేపీపై తోడుదొంగల ప్రజా చార్జ్​షీట్​ను రిలీజ్ చేసి మీడియాతో మాట్లాడారు. 

తిరగబడదాం–తరిమి కొడదాం  కార్యక్రమంపై జిల్లాలో వచ్చేనెల వరకు అన్ని గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. గ్రామాల్లో ప్రజా కోర్టు ద్వారా బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు చేసిన అవినీతి, అక్రమాలను ప్రజలకు వివరిస్తామన్నారు. అలాగే పోస్ట్ కార్డు ఉద్యమం నిర్వహిస్తామని చెప్పారు. శంకర్, నారాయణ రెడ్డి, వీరు బాబు, షేక్ జమాల్, రఘు నాయుడు పాల్గొన్నారు.