ఉస్మానియాలో కరెంట్ కట్ తో రోగుల ఇబ్బందులు

ఉస్మానియాలో కరెంట్ కట్ తో రోగుల ఇబ్బందులు

హైదరాబాద్  ఉస్మానియా ఆస్పత్రిలో పవర్ కట్ అయ్యింది. దీంతో  రోగులు, బంధువులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.  ఓపీ కార్డ్స్ కోసం రోగుల బంధువులు పడిగాపులు గాస్తున్నారు.  కరెంట్  కట్ అయి గంటైనా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఇప్పటికే జారీ చేసిన ఓపీ కార్డ్ ఉన్నా మందులు ఇవ్వడం లేదని బంధువుల ఆరోపిస్తున్నారు. కొత్త ఓపీ కార్డ్స్ తీసుకోవాలని చెబుతున్నారంటూ వాపోతున్నారు.   కరెంట్ వస్తుందేమోనని ఓపీ దగ్గరే క్యూ లైన్లో నిలుచున్నారు బాధితులు. గంటల తరబడి లైన్లో నిల్చోలేక నరకయాతన అనుభవిస్తున్నారు.