పేషెంట్లకు బిల్లును వివరంగా ఇవ్వాలి:  ప్రైవేట్ హాస్పిటళ్లకు హెల్త్​ డిపార్ట్​మెంట్ ఆదేశం

పేషెంట్లకు బిల్లును వివరంగా ఇవ్వాలి:   ప్రైవేట్ హాస్పిటళ్లకు హెల్త్​ డిపార్ట్​మెంట్ ఆదేశం

టెస్టులు.. మందులు.. పీపీఈ కిట్ల రేట్లతో బోర్డులు పెట్టాలి

హైదరాబాద్‌, వెలుగు: డాక్టర్లు, నర్సులు, ఇతర హెల్త్ స్టాఫ్ వాడుతున్న పీపీఈ కిట్ల రేట్లు, కరోనా పేషెంట్లకు ఇస్తున్న ఖరీదైన మెడిసిన్స్ రేట్లు, టెస్టుల రేట్లు అన్నింటినీ పేషెంట్లకు కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రైవేట్ హాస్పిటళ్లకు రాష్ట్ర హెల్త్ డిపార్ట్ మెంట్ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. హాస్పిటల్‌ ఎంట్రెన్స్ లో ఈ బోర్డులు ఉంచాలని స్పష్టం చేసింది. అలాగే, పేషెంట్లకు ఇచ్చే బిల్లును వివరంగా ఇవ్వాలని సూచించింది. ఏయే మందులు వాడారు.. వాటికి ఎంత చార్జ్ వేశారు.. ఏయే టెస్టులు చేశారు.. వాటికి ఎంత చార్జ్ వేశారు.. పీపీఈ కిట్లు ఎట్లెట్ల వాడారు.. వాటికి ఎంత చార్జ్‌  వేశారు.. వంటి పూర్తి వివరాలను బిల్లులో పేర్కొ నాలని ఆదేశించింది. కరోనా పేషెంట్లకు అడ్డగోలుగా చార్జ్‌ చేయడం, దేనికి ఎంత చార్జ్ వేశారో చెప్పకపోవడం వంటి అంశాలపై ఫిర్యాదులు రావడంతో ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌  డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ ఆర్డర్స్ వెంటనే అమల్లోకి వస్తాయని చెప్పారు. బోర్డులు ఏర్పాటు చేయకపోయినా.. బిల్లులు వివరంగా ఇవ్వకపోయినా.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలో లేని టెస్టులకు గతేడాది డిసెంబర్‌‌ నాటి రేట్ల ప్రకారమే చార్జ్‌ చేయాలని మరోసారి సూచించారు. అంతకంటే ఎక్కువ వసూలు చేసినట్టు తేలితే చర్యలు తీసుకుంటామన్నారు. కానీ ఇంతకుముందూ ఈ తరహా ఆర్డర్లు ఇచ్చినా ప్రైవేట్ హాస్పి టళ్లు లెక్క చేయలేదు. కరోనా పేషెంట్లకు కేటాయించిన బెడ్లు, అందులో ఖాళీల వివరాలతో బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించినా పట్టించుకోలేదు.