టార్గెట్ 2024: రాజోలుపై ప్రత్యేక దృష్టి పెట్టిన పవన్..

టార్గెట్ 2024: రాజోలుపై ప్రత్యేక దృష్టి పెట్టిన పవన్..

2019 ఎన్నికల నాటి నుండి ఏపీ రాజకీయాల్లో రాజోలు నియోజకవర్గం ఒక ప్రత్యేకత సంతరించుకుంది. గత ఎన్నికల్లో జనసేన గెలిచిన ఏకైక అసెంబ్లీ స్థానం అదే కావటమే ఇందుకు కారణం. అయితే, రాజోలు నుండి గెలుపొందిన రాపాక వరప్రసాద్ ఆ తర్వాత జనసేనకు దూరంగా ఉంటూ వైసీపీకి చేరువవ్వటంతో గెలిచిన ఒక్క సీటు కూడా జనసేన ఖాతాలో లేకుండా పోయింది. ప్రస్తుతం 2024 ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో ఈసారి రాజోలు నియోజకవర్గాన్ని ఎలా అయినా దక్కించుకోవాలని పవన్ భావిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో రాజోలు సీటును రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాద్ కేటాయిస్తున్నట్లు ప్రకటించింది జనసేన. గత ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసి గెలిచిన రాపాక వరప్రసాద్, ఇప్పుడు వైసీపీలో చేరి అమలాపురం లోక్ సభ బరిలో దిగనున్నాడు. ఈ క్రమంలో జనసేన ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ తరఫున మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు గొల్లపల్లి సూర్యారావు రాజోలు నుండి బరిలో దిగుతున్న నేపథ్యంలో ఈ స్థానంపై ఉత్కంఠ నెలకొంది. మరి, రసవత్తరంగా జరగనున్న ఈ పోరులో జనసేన, వైసీపీలలో ఎవరు పై చేయి సాధిస్తారో వేచి చూడాలి. 

ALSO READ :- Prasanth Varma: ప్రశాంత్ వర్మ సెట్స్లో కొత్త డెరెక్టర్..ఆయనెవరో గుర్తుపట్టారా?