సీమా హైదర్ కు బిగ్ షాక్.. రూ. 3కోట్ల పరువు నష్టం దావా వేసిన మాజీ భర్త

 సీమా హైదర్ కు బిగ్ షాక్.. రూ. 3కోట్ల పరువు నష్టం దావా వేసిన మాజీ భర్త

పాక్ నుంచి భారత్ లోకి అక్రమంగా ప్రవేశించి భారత్ లోకి ప్రవేశించిన సీమా హైదర్ కు బిగ్ షాక్ తగిలింది. ఆమె మాజీ భర్త  గులాం హైదర్‌ తాజాగా సీమా హైదర్‌, ఆమె ప్రియుడు సచిన్‌ మీనాలకు మూడు కోట్ల విలువైన పరువు నష్టం నోటీసు పంపారు.  అంతేకాకుండా సీమా హైదర్ తరుపు న్యాయవాదికి ఏపీ సింగ్‌కు రూ. ఐదు కోట్ల పరువు నష్టం నోటీసు పంపారు.  ఈ డబ్బులను నెల రోజుల్లోగా చెల్లించాలని నోటీసులో డిమాండ్ చేశాడు. లేకపోతే కఠినమైన చర్యలు తీసుకుంటామని  హెచ్చరించాడు.  

గులాం హైదర్‌ ఇటీవల హర్యానాలోని పానిపట్‌కు చెందిన సీనియర్ న్యాయవాది మోమిన్ మాలిక్‌ను తన తరపు న్యాయవాదిగా నియమించుకున్నారు.  తాను సీమా హైదర్ నుండి ఇప్పటి వరకు చట్టబద్ధంగా విడాకులు తీసుకోలేదని, సచిన్ కారణంగానే తన నలుగురు పిల్లలు  తనకు దూరమయ్యారని, వారి చదువులు దిగజారుతున్నాయని ఆరోపించారు. 

కాగా ఉత్తరప్రదేశ్ కు చెందిన సచిన్ మీనా (22)తో తరచూ ఆన్ లైన్ లో పబ్జీ గేమ్ ఆడిన సీమా హైదర్.. అతనితో ప్రేమలో పడింది. తన నలుగురు పిల్లలను తీసుకుని ఇండియాకు వచ్చేసింది. ఈ క్రమంలో అక్రమంగా దేశంలోకి వచ్చినందుకు సీమాను, ఆమెకు ఆశ్రయం ఇచ్చినందుకు సచిన్ ను  పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత వాళ్లిద్దరికీ కోర్టు బెయిల్ ఇచ్చింది.  ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో నివాసముంటోంది.