
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్ ఐపీఎల్పై పడింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాక్ మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఆపరేషన్ సిందూర్కి కౌంటర్గా పాక్ దాడులు చేసే అవకాశం ఉండటంతో భారత్ హై అలర్ట్ అయ్యింది. ఈ మేరకు పాక్ సరిహద్దు రాష్ట్రా్ల్లో భద్రతా కారణాల దృష్ట్యా ఎయిర్ పోర్టులు మూసివేశారు. ఇందులో భాగంగానే హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా ఎయిర్ పోర్టును క్లోజ్ చేశారు.
ఈ ప్రభావంతో 2025, మే 11న హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల స్టేడియం వేదికగా జరగాల్సిన పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ వేదిక మార్చింది బీసీసీఐ. ఈ మ్యాచ్ను ధర్మశాల నుంచి గుజరాత్లోని అహ్మదాబాద్కు షిప్ట్ చేసింది. బోర్డర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్ వేదిక మార్చినట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. దీంతో ముంబై, పంజాబ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా తలపడనున్నాయి. ఈ సీజన్లో పంజాబ్ తమ సెకండ్ హోం గ్రౌండ్గా ధర్మశాలను ఎంచుకున్న విషయం తెలిసిందే.
ఇక, గురువారం (మే 8) ధర్మశాల స్టేడియం వేదికగా జరగనున్న ఢిల్లీ, పంజాబ్ మ్యాచ్ యధావిధిగా జరుగుతుందని ఐపీఎల్ నిర్వాహకులు వెల్లడించారు. బార్డర్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ మ్యాచ్ కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మ్యాచ్కి హాజరయ్యే ప్రేక్షకులను భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేసి స్టేడియం లోపలికి పంపనుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా స్టేడియం పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే కాంగ్రా ఎయిర్పోర్ట్ మూసివేయడంతో ఈ మ్యాచ్ అనంతరం ఢిల్లీ, పంజాబ్ ఆటగాళ్లు రైలు లేదా రోడ్డు మార్గంలో వెళ్లనున్నారు.