
పెట్రోల్ పై ట్యాక్స్ ఎందుకు తగ్గించడం లేదని కేసీఆర్ ను ప్రశ్నించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు తగ్గుతున్నా.. దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నారన్నారు. ధరల పెరుగుదలకు నిరసనగా ముడిమ్యాల నుంచి చేవెళ్ల వరకు పాదయాత్ర చేశారు రేవంత్. విదేశాల్లో నుంచి నల్లధనం తెచ్చి.. ప్రజలందరికీ రూ.15లక్షల చొప్పున ఇస్తానని మోడీ మాట తప్పారన్నారు. ప్రతి ఏటా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని మోడీ..ఇంత వరకు ఉద్యోగాల ఊసెత్తడం లేదన్నారు. మద్యం రేట్లు భారీగా పెంచారన్నారు. క్వార్టర్ బాటి పై రూ.120 పెంచారన్నారు. రూ. 400 ఉన్న సిలిండర్ ధరను వెయ్యికి పెంచారన్నారు. రైతుల ఆదాయం డబుల్ చేస్తామన్నారు.. ఏమైందని ప్రశ్నించారు రేవంత్. మోడీ, కేసీఆర్ కలిసి పన్నుల రూపంలో పేదల నుంచి రూ.32 లక్షల కోట్లు దోచుకున్నారన్నారు.