
కామారెడ్డి, వెలుగు : ఇటీవల పీసీసీ జనరల్ సెక్రటరీగా నియమితులైన కామారెడ్డి జిల్లాకు చెందిన గడ్డం చంద్రశేఖర్రెడ్డి శనివారం హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. పీసీసీ కార్యవర్గంలో జనరల్ సెక్రటరీగా నియమించినందుకు సీఎంను సన్మానించారు.
పార్టీని బలోపేతం చేయటంతో పాటు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం సూచించారు. కామారెడ్డి అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరినట్లు గడ్డం చంద్రశేఖర్రెడ్డి తెలిపారు.