సీఎం రేవంత్రెడ్డిని కలిసిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ

సీఎం రేవంత్రెడ్డిని కలిసిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ

కామారెడ్డి​, వెలుగు : ఇటీవల పీసీసీ జనరల్ సెక్రటరీగా నియమితులైన కామారెడ్డి జిల్లాకు చెందిన గడ్డం చంద్రశేఖర్​రెడ్డి శనివారం హైదరాబాద్​లో సీఎం రేవంత్​రెడ్డిని కలిశారు.  పీసీసీ కార్యవర్గంలో జనరల్ సెక్రటరీగా నియమించినందుకు సీఎంను సన్మానించారు.  

పార్టీని బలోపేతం చేయటంతో పాటు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం సూచించారు.    కామారెడ్డి అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరినట్లు గడ్డం చంద్రశేఖర్​రెడ్డి తెలిపారు.