లిక్కర్​ స్కాం డైవర్షన్​కే కవిత దీక్ష: కల్వ సుజాత

లిక్కర్​ స్కాం డైవర్షన్​కే కవిత దీక్ష: కల్వ సుజాత

హైదరాబాద్, వెలుగు : లిక్కర్ కేసును డైవర్ట్ చేసేందుకే ఎమ్మెల్సీ కవిత మళ్లీ నిరాహార దీక్ష చేపట్టిందని, ఇది మహాశివరాత్రి దీక్ష అని పీసీసీ అధికార ప్రతినిధి కల్వ సుజాత ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆమె గాంధీ భవన్ మీడియాతో మాట్లాడారు. లిక్కర్ కేసు విచారణకు వచ్చినపుడల్లా కవిత ఏదో ఒక ఇష్యూతో ధర్నాలు చేస్తూ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నదని మండిపడ్డారు. పాలమూరు జిల్లా కోసం డీకే అరుణ మంత్రిగా ఉన్నపుడు ఏం చేయలేదని సుజాత మండిపడ్డారు. 

లిక్కర్ స్కాంలో, కాళేశ్వరం అవినీతిపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా.. వారిపై బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేదని డీకే అరుణను సుజాత ప్రశ్నించారు. తమ ప్రభుత్వం కూలుతుందని విమర్శలు చేయకుండా సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. సీఎం హోదాలో కేంద్ర మంత్రిని కేసీఆర్ తిట్టినప్పుడు కేటీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.