కేసీఆర్ వ్యాఖ్యలపై పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ఫైర్

కేసీఆర్ వ్యాఖ్యలపై పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ఫైర్

 హైదరాబాద్, వెలుగు: నల్గొండ సభలో మాజీ సీఎం కేసీఆర్‌‌ చేసిన వ్యాఖ్యల‌‌పై పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌‌‌‌, బీఆర్‌‌‌‌ఎస్‌‌ ఎమ్మెల్యేలు మేడిగడ్డకు ఏం పీకడానికి పోయారో చెప్పాలన్నారు.  మేడిగడ్డను బొందలగడ్డ చేసిందెవరని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం, సీఎం రేవంత్‌‌రెడ్డి పట్ల బీఆర్‌‌‌‌ఎస్ నాయకులు తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. ‘మీరు ఒక్కటి మాట్లాడితే, మేము నాలుగు మాట్లాడ్తాం. మీరు ఏలు అడ్డం పెడితే, మేము కాలు పెడ్తం. ఏదైనా చేయగలిగే దమ్ము మాకున్నది.”అని హెచ్చరించారు. శనివారం అసెంబ్లీలో ఇరిగేషన్‌‌ శ్వేతపత్రంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరంతో కోటి ఎకరాలకు నీళ్లిస్తామని చెప్పి, లక్ష ఎకరాలకు కూడా ఎందుకివ్వలేదో కేసీఆర్ అసెంబ్లీకొచ్చి చెప్పాలన్నారు. ప్రాజెక్టు నిర్మించిన మంథని నియోజకవర్గానికి, పక్కనున్న రామగుండం, పెద్దపల్లి నియోజకవర్గాలకూ చుక్క నీళ్లు ఇవ్వలేదన్నారు.