Peddapalli Railway station: ఫలించిన పెద్దపల్లి ఎంపీ కృషి.. తిరుమల వెళ్లే ఈ ట్రైన్.. మళ్లీ పెద్దపల్లి రైల్వేస్టేషన్లో ఆగనుంది..!

Peddapalli Railway station: ఫలించిన పెద్దపల్లి ఎంపీ కృషి.. తిరుమల వెళ్లే ఈ ట్రైన్.. మళ్లీ పెద్దపల్లి రైల్వేస్టేషన్లో ఆగనుంది..!

పెద్దపల్లి జిల్లా: కరీంనగర్ తిరుపతి బై వీక్లీ ఎక్స్ ప్రెస్(12762/12761) పెద్దపల్లి రైల్వే స్టేషన్లో హాల్టింగ్ తొలగించడంపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంజిన్ రివర్స్ల్ సమయాన్ని తగ్గించడం, అలాగే కొత్త బై పాస్ లైన్ ప్రారంభించిన తర్వాత పెద్దపల్లిలో హాల్టింగ్ను దారి మళ్లించారని ప్రయాణికులు పెద్దపల్లి ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తక్షణమే స్పందించిన ఆయన సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులకు దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు.

పెద్దపల్లిలో ఈ హాల్టింగ్ నిలిపివేయడం వల్ల చాలా మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని, ప్రయాణికుల ఖర్చు పెరగడమే కాకుండా తిరుపతి దైవ దర్శనానికి వెళ్లలేకపోతున్నారని సౌత్ సెంట్రల్ రైల్వే దృష్టికి ఎంపీ తీసుకెళ్లారు. ఎంపీ చెప్పిన విషయాన్ని విన్న  సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెంటనే స్పందించారు. తొలగించిన హాల్టింగ్ను రైల్వే శాఖ పునరుద్ధరించింది.

పెద్దపల్లి ఎంపీ రిక్వెస్ట్తో పెద్దపల్లి రైల్వే స్టేషన్లో తిరిగి కరీంనగర్ తిరుపతి బై వీక్లీ ఎక్స్ ప్రెస్ హాల్టింగ్ పునరుద్ధరించామని రైల్వే జనరల్ మేనేజర్ అధికారికంగా ప్రకటించారు. పెద్దపల్లి రైల్వే స్టేషన్లో నిలిచిపోయిన హాల్టింగ్ తిరిగి ప్రారంభం కావడంతో పెద్దపల్లి జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

పెద్దపల్లి ఎంపీ వినతులతో రైల్వే సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవడం పెద్దపల్లి ప్రజల అదృష్టమని జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేశారు. హాల్టింగ్ పునరుద్ధరించడంతో సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. పెద్దపల్లి ఎంపీ వెంట చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కూడా ఉన్నారు. పెద్దపల్లి రైల్వే స్టేషన్ హాల్టింగ్ పునరుద్ధరించడంపై హర్షం వ్యక్తం చేశారు.