పింఛన్ పైసలిస్తలేరు

పింఛన్ పైసలిస్తలేరు

తిర్యాణి, వెలుగు: మూడు నెలలుగా పింఛన్ పైసలు ఇవ్వడం లేదని వృద్ధులు, మహిళలు వాపోతున్నారు. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని పోస్టాఫీస్, ఎంపీడీవో ఆఫీస్ ఎదుట బాధితులంతా సోమవారం ఆందోళన చేశారు. రొంపల్లి, సత్తిగూడ, పంగిడి మాధర, మంగి, తిర్యాణి, చింతపల్లి, ఇర్కపల్లి గ్రామాలకు చెందినవారు నిరసనలో పాల్గొన్నారు.

పింఛన్ ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు వస్తాయనే ఆశతో రోజూ ఊర్ల నుంచి ఇక్కడికి వచ్చి వెళ్తున్నామని, కానీ డబ్బులు రాకపోవడంతో ఆటో చార్జీలు తడిసిమోపెడవుతున్నాయన్నారు. ప్రభుత్వం నుంచి సకాలంలో పింఛన్లు రావడం లేదని, వచ్చాక అందరికీ అందజేస్తామని ఈఓపీఆర్డీ రవికుమార్ తెలిపారు.