ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు

ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు

మంచిర్యాల : మున్సిపల్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరేయాలన్నారు మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి. టీఆర్ఎస్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపారు. మంచిర్యాల మున్సిపాలిటి ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులతో ఆదివారం వివేక్ సమావేశమయ్యారు.

వారి విజయం కోసం సలహాలు,సూచనలు చేశారు. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. అధికార పార్టీ ప్రలోభాలకు లొంగకుండా బీజేపీ విజయం కోసం కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

See Also: టీఆర్ఎస్​ టికెటివ్వలేదని ఇల్లు కాలబెట్టుకోబోయిండు