కేసీఆర్, కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రజలు నమ్మరు : గజ్జెల కాంతం

కేసీఆర్, కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రజలు నమ్మరు :  గజ్జెల కాంతం

హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ వర్కింగ్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, కానీ ప్రజలు వారిని నమ్మే పరిస్థితిలో లేరని కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం అన్నారు. శనివారం గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌లో దుద్దిల్ల శ్రీపాద రావు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గజ్జెల కాంతం మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు శ్రీపాదరావు ఎనలేని సేవలు చేశారని గుర్తుచేశారు. మరకలేని మహానుభావుడిని కొంతమంది పొట్టనబెట్టుకున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేటీఆర్ జైలుకు పోవుడు ఖాయమని, అందుకే ఆయన మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కో హామీని అమలు చేస్తుంటే, వాళ్లు అనవసరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.