నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలి : ప్రజాపంథా నాయకులు

నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలి : ప్రజాపంథా నాయకులు

ఆర్మూర్, వెలుగు:  ఆర్మూర్ టౌన్ లోని నిజాంసాగర్ కాలువ తెగి పోవడంతో నష్టపోయిన కెనాల్​ కట్ట వాసులను ప్రభుత్వం  ఆదుకోవాలని సీపీఐఎంఎల్ ప్రజాపంథా నాయకులు డిమాండ్​ చేశారు. మంగళవారం సీపీఐఎంఎల్​ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి .ప్రభాకర్, జిల్లా నాయకులు బి.దేవరాం, ముత్తన్న   కెనాల్ కట్టను పరిశీలించారు.  బాధిత కుటుంబీకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.  

కాలువ తెగిపోవడానికి కారణం అధికారుల  నిర్లక్ష్యమే అన్నారు.  కెనాల్​ నీటితో ఇండ్ల సామగ్రి కొట్టుకుపోయిందన్నారు.   బాధితులను గుర్తించి కుటుంబానికి రూ.20 వేలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కెనాల్​ కట్ట వెంట ఇల్లు కట్టుకుని ఉంటున్న అందరికి ఇంటి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి. బి. కిషన్, పీడీఎస్​యూ జిల్లా అధ్యక్షుడు  ఎం.నరేందర్, జిల్లా నాయకులు ఆకుల గంగారం, శేఖర్, లక్ష్మి,  బి.కిషన్, అరవింద్, రవి పాల్గొన్నారు.