బస్సుల్లో ఫ్రీ జర్నీ ఇష్టం లేనివాళ్లు డబ్బులిచ్చి టికెట్​ కొనుక్కోవచ్చు: పొన్నం ప్రభాకర్

బస్సుల్లో ఫ్రీ జర్నీ ఇష్టం లేనివాళ్లు డబ్బులిచ్చి టికెట్​ కొనుక్కోవచ్చు: పొన్నం ప్రభాకర్

నవాబుపేట,వెలుగు:  ఉచిత ప్రయాణం ఇష్టం  లేని వారు డబ్బులిచ్చి టికెట్​ కొనుక్కోవచ్చని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం మహబూబ్​నగర్​ జిల్లా నవాబుపేట మండలం కొల్లూరు లో చింతలపూడి మఠం ముఖ ద్వారాన్ని ఎమ్యెల్యేలు అనిరుధ్​రెడ్డి, మధుసూధన్​రెడ్డి, రాజేశ్​రెడ్డి, వీర్లపల్లి శంకర్​తో కలిసి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే రెండు గ్యారంటీలను అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుద్దేశంతో ప్రారంభించిన కార్యక్రమమని, ఫ్రీగా ప్రయాణించడం ఇష్టం లేనివారు టికెట్​ తీసుకోవచ్చన్నారు.  బీజేపీ రాముడి బొమ్మతో రాజకీయాలు చేస్తుంటే, మరోవైపు పనిపాట లేని బీఆర్ఎస్​ నాయకులు జనాలను రెచ్చగొడుతూ నీచ​రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి  జహీర్​ అక్తర్, మండల పార్టీ అధ్యక్షుడు నీరటి రాంచంద్రయ్య, బంగ్లరవి, ఖాజా, ఎంపీటీసీ తుల్సిరాం నాయక్, వెంకటేశ్​గౌడ్, కృష్ణయ్య, భూపాల్​రెడ్డి, వాసుయాదవ్​ పాల్గొన్నారు.