కల్లులో కలిపే మత్తు పదార్థాలు రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్

కల్లులో కలిపే మత్తు పదార్థాలు రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్

కల్లులో కలిపే మత్తు పదార్థాలను రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని దగ్గర నుంచి 28 మత్తు పదార్థాల బ్యాగులను బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ బ్యాగులు సుమారు 568 కిలోల క్లోరో హైడ్రేట్ అనే మత్తు పదార్థాన్ని పట్టుకున్నామని సూపర్డెంట్ విజయ్ భాస్కర్ తెలిపారు. బోయిన్ పల్లి నుంచి బాలానగర్ వస్తున్న క్రమంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా.. కారులో ఈ మత్తు పదార్థాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. 
  
మహారాష్ట్ర రాష్ట్రంలోని రాజు భాయ్ అనే వ్యక్తి దగ్గర నుంచి మత్తు పదార్థాలను కొనుగోలు చేసి.. తీసుకొని వస్తుండగా రామా గౌడ్ ని అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశామని.. అతను తెలిపిన వివరాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వారికోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.