కరీంనగర్ యువ ఇంజినీర్ ప్రతిభ
35 వేల ఖర్చయ్యిందన్న గంగాధర్
కరీంనగర్ సిటీ, వెలుగు : కరీంనగర్లోని సాయినగర్కు చెందిన బీటెక్ ఎలక్ట్రానిక్స్చదివిన యువ ఇంజినీర్ గంగాధర్.. పెట్రోల్, ఎలక్ట్రిక్ బైక్ను రూపొందించాడు. రెండు రకాల ఎనర్జీలను వాడడం వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉంటుందంటున్నాడు. ఈ బైక్ తయారు చేయడానికి సుమారు రూ.35 వేల ఖర్చయ్యిందని చెప్పాడు. పెట్రోల్ ఇంజిన్ వాహనాన్ని ఎలక్ట్రిక్ వెహికల్గా మార్చడం వల్ల పెట్రోల్ వాహనం ఇంజిన్కు ఎలాంటి సమస్య ఉండదన్నాడు. ప్రభుత్వం అధికారులు స్పందించి తనకు అవకాశం కల్పిస్తే మరిన్ని వాహనాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తానని చెప్పాడు. 2017లో బీటెక్ పూర్తి చేసిన గంగాధర్సొంతంగా ల్యాబ్ పెట్టుకుని రీసెర్చ్ చేస్తున్నాడు. కొత్త కొత్త ఐడియాలతో పరికరాలను తయారు చేయడం, ఎవరైనా ఆలోచనలను షేర్చేస్తే వారితో కలిసి పని చేయడం గంగాధర్ స్పెషాలిటీ. ఇంతకుముందు ఇతడు మొక్కలకు నీరు కావాల్సినపుడు ‘నీరు పోయండి’ అని చెప్పే డివైజ్తయారు చేసి అందరి మన్ననలు పొందాడు.
మరిన్ని వార్తల కోసం..
డీఎస్ఈ ముందు కేజీబీవీ టీచర్ల ఆందోళన