గీతంలో ఘనంగా ఫార్మసిస్ట్​ దినోత్సవం

గీతంలో ఘనంగా ఫార్మసిస్ట్​ దినోత్సవం

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు :  పటాన్​చెరు పరిధిలోని గీతం డీమ్డ్​ యూనివర్శిటీ స్కూల్​ ఆఫ్​ ఫార్మసీ ఆధ్వర్యంలో సోమవారం ఫార్మసిస్ట్​ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ‘ఆరోగ్య వ్యవస్థలను మెరుగుపరచడంలో ఫార్మసిస్టుల పాత్ర’ అనే అంశంపై సింపోసియాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథులుగా హెటిరో డ్రగ్స్​ సీడీఎంఏ గ్లోబల్​ హెడ్ డాక్టర్​ వై. శ్రీధర్​ రెడ్డి, క్లినోసోల్​ రీసెర్చ్​ ఫౌండర్​, సీఈఓ సీ.ఎఎస్​. మజీబుద్ధీన్​ హాజరయ్యారు.

ఈ సందర్భంగా శ్రీధర్​ రెడ్డి మాట్లాడుతూ స్టూడెంట్స్​ ఫార్మా సబ్జెక్టులపై పట్టు సాధించి కొత్త ఆవిష్కరణలు కనిపెట్టాలని సూచించారు. క్లినికల్​ డేటా సైన్స్​, ఏఐ అనలిటిక్స్​, రంగాలలో ఫార్మాసిస్ట్​లు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫార్మసీ ప్రిన్సిపల్​ ప్రొఫెసర్​ జి. శివకుమార్, ఆర్గనైజర్​ డాక్టర్​ హైమ, డాక్టర్​ శ్రీకాంత్​, స్వప్నిక తదితరులు పాల్గొన్నారు.