శాతవాహన వర్సిటీలో ఎం ఫార్మసీ కోర్సు.. ఆమోదం తెలిపిన ఫార్మసీ కౌన్సిల్

శాతవాహన వర్సిటీలో ఎం ఫార్మసీ కోర్సు.. ఆమోదం తెలిపిన ఫార్మసీ కౌన్సిల్

కరీంనగర్, వెలుగు: శాతవాహన యూనివర్సిటీ ఫార్మసీ కాలేజీలో కొత్తగా ఎంఫార్మసీ కోర్సులు 2025-–26 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించడానికి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపిందని వీసీ యు ఉమేశ్ కుమార్ తెలిపారు. 

ఎంతోకాలంగా కొత్త కోర్సులకు ఎదురు చూస్తున్న విద్యార్థులు ఫార్మసీ కాలేజీలో ఫార్మకాలజి, ఫార్మాసుటిక్స్, ఫార్మసుటికల్ అనాలసిస్ విభాగాల్లో 15 సీట్ల చొప్పున మొత్తం 45 సీట్లకు అడ్మిషన్స్ కి అనుమతి లభించిందన్నారు.