కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరిన పొన్నాల లక్ష్మయ్యను మళ్లీ పార్టీలోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగా గురువారం లక్ష్మయ్యకు రాహుల్ గాంధీ ఆఫీసు నుంచి ఫోన్ చేసినట్టు పార్టీ వర్గాల సమాచారం. ఢిల్లీకి వచ్చి రాహుల్ను ఒకసారి కలవాల్సిందిగా ఆ ఫోన్లో సూచించినట్టు చెప్తున్నారు.
దీనిపై పొన్నాల క్లారిటీ ఇచ్చారు. తనకు ఎవరూ ఫోన్ చేయలేదని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇదంతా తప్పుడు ప్రచారమన్నారు. ఇలాంటి చిల్లర ప్రచారాలకు ప్రభావితమయ్యే వ్యక్తిని కానని తేల్చి చెప్పారు. 45 ఏండ్ల పాటు తాను కాంగ్రెస్ పార్టీలో రాజకీయ సేవ చేశానని, ఎన్నో అవమానాలు భరించానని చెప్పారు. బీసీలను రేవంత్ రెడ్డి పురుగులను చూసినట్టు చూస్తున్నారని ఫైర్ అయ్యారు.