రేపు (జూలై 9న) ఫోన్ ట్యాపింగ్ విచారణకు.. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే

రేపు (జూలై 9న) ఫోన్ ట్యాపింగ్ విచారణకు.. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే
  • ఎమ్మెల్యే యెన్నం

పాలమూరు, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని మహబూబ్​నగర్​ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​రెడ్డికి పోలీసులు నోటీసులు పంపించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా  మహబూబ్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న యెన్నం శ్రీనివాస్ రెడ్డి మొబైల్ ట్యాపింగ్​కు గురైందని, సీడీఆర్ జాబితాలో ఎమ్మెల్యే ఫోన్ నంబర్​ఉన్నట్టు నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల10న ఉదయం11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట హాజరై స్టేట్ మెంట్ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరారు.