మీకు తెలుసా: ఈ బీచ్ లో ఫొటోలు, సెల్పీలు తీసుకుంటే జైల్లో వేస్తారు.. !

మీకు తెలుసా: ఈ బీచ్ లో ఫొటోలు, సెల్పీలు తీసుకుంటే జైల్లో వేస్తారు.. !

బీచ్ లంటే ఎవరికి మాత్రం ఇష్టముండదు. వెళ్లి ఎంజాయ్ చేస్తరు. బీచ్ లో ఫొటోలు.. సెల్ఫీలు తీసుకుని మురిసిపోతరు. కానీ థాయ్ లాండ్ లో ఉన్న ఓ బీచ్ లో ఇలా చేస్తే నడవదు. కెమెరా క్లిక్ మనిపిస్తే చాలు.. వెంటనే ఎయిర్ నేవిగేషన్ అధికారులు వచ్చి పట్టుకుపోతరు. కేసు తీవ్రతని బట్టి జైలు శిక్ష కూడా పడొచ్చు.

అక్కడి ఎయిర్ నేవిగేషన్ చట్టం ఇంత కఠినంగా ఉండడానికి కారణం ఏంటంటే.. అక్కడ ఉన్న 'మాయ్ ఖాన్ బీచ్' టూరిస్టులను విపరీతంగా ఆకర్షిస్తుంటుంది.ఈ బీచ్ పక్కనే పుకెట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఉండడంతో పర్యాటకులు తమ చేతులకు అందే అంత ఎత్తులో వెళుతున్న విమానాలను చూసి థ్రిల్ గా ఫీల్ అయితుంటరు. రన్వేపై ల్యాండింగ్ అయ్యే విమానాలు అత్యంత దగ్గరగా వెళ్తుంటాయి. బీచ్ అందాలను వీక్షించడానికి వచ్చిన పర్యాటకులు విమానాలు దగ్గరగా వచ్చినప్పుడు ఫొటోలకు ఫోజులు ఇస్తున్నరు. 

పర్యాటకులు ఇలా చేయడం వల్ల కాక్పిట్ లోని పైలట్ లు కన్ఫ్యూజ్ అయితున్నరంట. పర్యాటకులు తీసుకుంటున్న ఫొటోలు పైలట్ల ఏకాగ్రతను దెబ్బతీస్తున్నాయని థాయ్ అధికారులు చెప్తున్నరు. దీంతో విమానంలోని ప్రయాణికులు ప్రమాదం బారిన పడే అవకాశం ఉండడంతో ఆ దేశం ఈ రూల్ తీసుకొచ్చింది. ఇకపై అక్కడ ఫొటోలు తీసుకుంటే థాయ్ పోలీసులు జైల్లో పెడతారు. ఎవరైనా ఈ బీచ్ లో డ్రోన్స్ ఎగరేసినా, లేజర్ లైట్లు వేసినా, ఫొటోలు తీసుకున్నా జైలుకు పంపుతారు!