ఇకపై రైల్వే స్టేషన్స్లో ఫోటోస్, వీడియోస్ బ్యాన్.. జ్యోతి మల్హోత్ర స్పై కేసు ప్రభావం..

ఇకపై రైల్వే స్టేషన్స్లో ఫోటోస్, వీడియోస్ బ్యాన్.. జ్యోతి మల్హోత్ర స్పై కేసు ప్రభావం..

మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్లకు వెళ్లినప్పుడు సరదాగా ఫోటోలు, వీడియోలు తీయటం కామన్ కదా. చాలా మంది తాము ఎక్కడున్నాం.. ఆ రోజు ప్రోగ్రెస్ ఏంటి.. ఎలాంటి ఔట్ ఫిట్ లో ఉన్నాం.. అని ఫ్రెండ్స్ సర్కిల్స్ లో చెప్పుకోవడానికీ.. లేదంటే గుర్తుండిపోతుందనే ఉద్దేశంతో సెల్ఫీలు, వీడియోలు తీస్తుంటారు. కానీ ఇకనుంచి అలా చేయడానికి వీళ్లేదు. 

జ్యోతి మల్హోత్రా స్పై కేసు తర్వాత కీలక ప్రదేశాల్లో ఫోటోలు, వీడియోలు తీయటం సమాలోచన చేస్తున్నాయి వివిధ రాష్ట్రాలు. రైల్వే, బస్ స్టేషన్లు, రక్షణకు సంబంధించి ప్రదేశాలు, ప్రభుత్వ స్థలాలలో వీడియోలు తీయటం వలన ఉగ్రవాదులకు సమాచారం ఈజీగా వెళ్లే ఛాన్స్ ఉన్నందున.. వాటిపై  బ్యాన్ విధించేందుకు ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. 

రైల్వే స్టేషన్లలో సెల్ఫీలు, ఫోటోలు, వీడియోలు తీయటంపై బ్యాన్ విధించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ పై బ్యాన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భద్రత కారణాల రీత్యా అన్ని రైల్వే స్టేషన్లలో సెక్యూరిటీని పెంచింది. 

ALSO READ | సంతకాలు జరుగుతాయి.. కానీ ఆయుధాలు అందవు: ఎయిర్ ఫోర్స్ చీఫ్ AP సింగ్ కీలక వ్యాఖ్యలు

పహల్గాం ఉగ్రదాడి జరగక ముందు జ్యోతి మల్హోత్రా లాంటి యూట్యూబర్లు తీసిన వీడియోల ఆధారంగా టూరిస్ట్ ప్లేస్ లను గుర్తించి టెర్రరిస్టులు ప్లాన్ చేసినట్లుగా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. యూటూబర్లు, ఇండివిడువల్స్ ఈ ఫీడ్ ను షేర్ చేయకపోయినప్పటికీ.. సోషల్ మీడియా ద్వారా ఉగ్రవాదులు తీసుకునే అవకాశం ఉంది. ఆ ఆధారాలతో ముఖ్యమైన ప్రాంతాలు టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉన్నందున బ్యాన్ చేయాలని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్ణయించింది. 

దేశ భద్రత, పౌరుల సంరక్షణలో భాగంగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా సెక్యూరిటీని పెంచాయి రాష్ట్రాలు .అందులో భాగంగా యూపీ ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకుంది. యూపీ ప్రభుత్వ బాటలోనే మరిన్ని రాష్ట్రాలు దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 

పాకిస్తాన్​ కోసం గూఢచర్యం చేశారన్న ఆరోపణలపై ఆరుగురు భారతీయులను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నిందితుల్లో ప్రముఖ ట్రావెల్  బ్లాగర్, యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కూడా ఉంది. ‘ట్రావెల్ విత్ జో’ పేరుతో యూట్యూబ్ చానెల్ నడుపుతున్న జ్యోతి.. కమీషన్  ఏజెంట్ల సాయంతో వీసా పొంది 2023లో పాకిస్తాన్లో పర్యటించింది. తన పర్యటనలో ఎషానుర్  రహీం అలియాస్ డానిష్ అనే వ్యక్తితో పరిచయం చేసుకుని సంబంధాలు పెంచుకుంది. డానిష్ న్యూఢిల్లీలోని పాకిస్తాన్  హై కమిషన్లో స్టాఫ్ మెంబర్గా పనిచేస్తున్నాడు.