దారి పొడుగునా ధాన్యం రాశులు.. రైతులకు, వాహనదారులకు తిప్పలు

దారి పొడుగునా ధాన్యం రాశులు.. రైతులకు, వాహనదారులకు తిప్పలు

శివ్వంపేట, వెలుగు :  మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని చిన్న గొట్టిముక్కుల నుంచి సికిండ్లాపూర్ వరకు రోడ్డు పొడుగునా ధాన్యం రాశులు కనిపిస్తున్నాయి. రైతులు ధాన్యం ఆరబోసి కాంటా కోసం తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

మరోవైపు రోడ్డు మీద ధాన్యం ఆరబోయడం వల్ల వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు తొందరగా పూర్తి చేస్తే రైతులకు మేలు జరగడంతో పాటు వాహన దారులకు కూడా తిప్పలు తప్పుతాయి. ఎన్నికల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతుంది.