
హైదరాబాద్ సిటీ, వెలుగు: శిల్పా లేఅవుట్ ఫేజ్–2 ఫ్లైఓవర్కు దివగంత పీజేఆర్ పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఫ్లైఓవర్ ను ఈ నెల 28న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రారంభానికి ముందే పెయింటింగ్, సుందరీకరణతో సహా అన్ని పనులను పూర్తి చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్లు అధికారులను ఆదేశించారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పడనుంది. ప్రధానంగా గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వెళ్లేమార్గంలో ఇబ్బందులు తొలగనున్నాయి.