తెలంగాణకు మరో వరం.. ములుగు జిల్లాలో ట్రైబల్ వర్సిటీ..

తెలంగాణకు మరో వరం.. ములుగు జిల్లాలో  ట్రైబల్ వర్సిటీ..

పాలమూరు బీజేపీ ప్రజా గర్జన సభలో ప్రధాని నరేంద్ర మోదీ వరాల జల్లు కురిపించారు. తెలంగాణలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ములుగు జిల్లాలో ఈ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. 

మొత్తం రూ. 900 కోట్లతో కేంద్రీయ ట్రైబల్ యూనివర్సిటీని నిర్మిస్తామన్నారు. ఈ  సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి సమ్మక్క, సారలమ్మ వనదేవతల పేర్లు పెడడతామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందనడానికి ఇదే నిదర్శనమన్నారు. తెలంగాణ కోసం ఏ హామీ ఇచ్చినా..తాము చిత్తశుద్దితో సంతోషంతో ప్రకటిస్తామన్నారు.