
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం విదేశీ పర్యటనకు వెళుతున్నారు. సైప్రస్, కెనడా, క్రొయేషియాలలో 5 రోజులపాటు పర్యటిస్తారని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ ఆహ్వానం మేరకు మోదీ ఆ దేశంలో జూన్ 15, 16 తేదీల్లో పర్యటించనున్నారు.
ఇందులో భాగంగా సైప్రస్ అధ్యక్షుడితో ఆయన చర్చలు జరపనున్నారు. అక్కడి నుంచి మోదీ నేరుగా కెనడాకు వెళ్తారు. ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు జూన్ 16, 17 తేదీల్లో కననాస్కిస్ లో జరగనున్న జీ-7 సదస్సుకు హాజరుకానున్నారు. ఆ తర్వాత కెనడా నుంచి క్రొయేషియా వెళతారు.