సరిహద్దులో జవాన్లతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. రజౌరీ వెళ్లిన ఆయన అక్కడ.. అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. తర్వాత ఆర్మీ జవాన్లతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. వారికి స్వీట్లు తినిపించారు. సైనికులకు దిశానిర్దేశం చేశారు.
కాల్పుల విరమణను ఉల్లంగించి పాకిస్తాన్ ఈరోజు పొద్దున రజౌరీ పై ఫైరింగ్ చేసింది. దీంతో భారత జవాన్లు పాక్ కు ధీటుగా సమాదానం ఇచ్చారు. మోడీ దీపావళి పర్యటన రౌజోరీ లో జరగడం చర్చనీయాంశం అయింది. రౌజరీ తరువాత పఠాన్ కోట్ కు వెళ్లారు మోడీ. ప్రతీ దీపావళికి ఆర్మీ అధికారులతో, జవాన్లతో పండుగను జరుపుకుంటున్నారు ప్రధాని మోడీ.
#WATCH Jammu and Kashmir: Prime Minister Narendra Modi celebrated #Diwali in Rajouri district with Army personnel, today. pic.twitter.com/yyvveTaTr3
— ANI (@ANI) October 27, 2019