
దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఉచితంగా 75 లక్షల ఎల్పీజీ కనెక్షన్లు అందించాలని నిర్ణయించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 వరకు మూడేళ్లలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద ఈ గ్యాస్ కనెక్షన్లను పేదలకు ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపింది. ఇందు కోసం రూ. 1,650 కోట్లు కేటాయించింది. ఉజ్వల 2.0లో భాగంగా లబ్దిదారులకు రీఫిల్, స్టవ్ ను ఉచితంగా అందించనుంది.
ఇప్పటికే వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ. 200 తగ్గించింది కేంద్రం. దీనికి అదనంగా ఉజ్వల యోజన లబ్దిదారులకు రూ. 400 తగ్గించింది. ఈ కొత్త కనెక్షన్లతో ఉజ్వల పథకం కింద మొత్తం లబ్దిదారుల సంఖ్య 10.35 కోట్లకు చేరుతుంది. 2023 ఆగస్టు నాటికి దేశంలో దాదాపు 15 లక్షల పీఎంయూవై కనెక్షన్ల కోసం డిమాండ్ ఏర్పడింది.