ఫస్ట్ టికెట్ కొనుగోలు చేసిన మోడీ

ఫస్ట్ టికెట్ కొనుగోలు చేసిన మోడీ

ఢిల్లీలో ప్రధానమంత్రి సంగ్రహాలయ పేరుతో ఏర్పాటు చేసిన మ్యూజియంను ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించారు. గత ప్రధానమంత్రులకు దీనిని అంకితం చేశారు. తర్వాత మ్యూజియంలో మొదటి టికెట్ కొనుగోలు చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రధానమంత్రులు చేసిన సేవలను ఈ మ్యూజియంలో ప్రదర్శించనున్నారు.అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దీనిని నిర్మించారు.హోలోగ్రామ్స్, వర్చువల్ రియాలిటీ, మల్టీ టచ్ మల్టీమీడియా, ఇంటరాక్టివ్ స్క్రీన్స్ వంటివి ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తల కోసం

గ్రామీణ రైతులకు అందుబాటులోకి డ్రోన్లు

నాన్నను చూసి.. నల్లకోటు వేసుకున్నా