వాజ్పేయికి నివాళులర్పించిన ప్రధాని మోడీ

వాజ్పేయికి నివాళులర్పించిన ప్రధాని మోడీ

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి 98వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఢిల్లీలోని సదైవ్ అటల్ మెమోరియల్ కు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ థన్కర్, ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, హర్దీప్ సింగ్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా దేశానికి వాజ్ పేయి చేసిన కృషి మరవలేనిదని ప్రధాని మోడీ అన్నారు. 

అటల్ బిహారీ వాజపేయి భారతదేశానికి 10 వ ప్రధానిగా పనిచేశారు. 1996 నుండి 2004 ల మధ్య మూడు పర్యాయాలు ఆయన  ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు మొదటిసారి 13 రోజుల పాటు ప్రధానిగా ఉన్న  వాజపేయి.. రెండో సారి 13 నెలలు  ఆ పదవీలో కొనసాగారు. మూడోసారి ఫుల్ టర్మ్ పదవిలో ఉన్నారు. 93 ఏళ్ల వయసులో 2018 ఆగస్ట్ 16న వాజపేయి  మరణించారు.