- మోడీ అధ్యక్షతన యూఎన్ డిబేట్
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ‘సముద్ర భద్రత’పై సోమవారం వర్చువల్ గా జరిగిన డిబేట్ కు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత వహించారు. భద్రతా మండలికి ఈ నెల మన దేశం నాయకత్వం వహిస్తుండటంతో డిబేట్కు ప్రధాని అధ్యక్షుడిగా వ్యవహరించారు. దీంతో సెక్యూరిటీ కౌన్సిల్ డిబేట్ కు అధ్యక్షత వహించిన తొలి ఇండియన్ పీఎంగా మోడీ నిలిచారు. డిబేట్ లో ఆయన మాట్లాడుతూ.. సముద్రాల భద్రత అన్ని దేశాల బాధ్యత అని చెప్పారు. సముద్ర జలాల సరిహద్దుల విషయంలో ఏర్పడే వివాదాలను అంతర్జాతీయ చట్టాల ప్రకారం, శాంతియుతంగానే పరిష్కరించుకోవాలని ప్రపంచ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు.