ఐకానిక్ వీక్ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం రూ. 2, రూ. 5, రూ. 10, రూ. 20 బిళ్లలరను రిలీజ్ చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రత్య్రేక థీమ్ లోగోతో వీటిని రూపోందించారు. అలాగే దృష్టి లోపం ఉన్నవారు వీటిని సులంభంగా గుర్తించేలా తయారుచేశారు. కొత్త నాణేలు అమృత్ కాల్ లక్ష్యాలను ప్రజలకు నిరంతరం గుర్తుచేస్తాయని, దేశాభివృద్ధికి దోహదపడేలా వారిని ప్రేరేపిస్తాయని మోదీ అన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి క్రెడిట్-లింక్డ్ గవర్నమెంట్ స్కీంల కోసం జాతీయ పోర్టల్ జన్ సమర్థ్ పోర్టల్ ను కూడా ప్రారంభించారు మోడీ.
మరిన్ని వార్తలు..
ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఫీజులు దోపిడి
ఇక్కడ వర్షాలు..అక్కడ ఎండలు