చెన్నై- తిరునల్వేలి వందే భారత్ .. ఆగస్టు 6న ప్రారంభించనున్న మోడీ

 చెన్నై- తిరునల్వేలి వందే భారత్ .. ఆగస్టు 6న  ప్రారంభించనున్న మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ మరో వందే భారత్ రైలుకు పచ్చ జెండా ఊపనున్నారు.  ఆగస్టు 6న తమిళనాడులో మూడవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును మోడీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైలు చెన్నై టూ  తిరునల్వేలి మధ్య నడుస్తుంది. సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పోలిస్తే ఈ వందే భారత్ రైలులో ప్రయాణికులకు రెండు గంటల వరకు సమయం ఆదా అవుతుందని  రైల్వే అధికారులు తెలిపారు. 8 కోచ్‌లు ఉన్న ఈ వందే భారత్  రైలు తిరుచ్చి, మదురై  రెండు చోట్ల మాత్రమే ఆగుతుంది 

అంతకుముందు ఏప్రిల్ 8న చెన్నై- కోయంబత్తూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను మోడీ జెండా ఊపి ప్రారంభించారు.   ఫిబ్రవరి 15, 2019న న్యూఢిల్లీ - వారణాసి మధ్య   మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోడీ  ప్రారంభించారు.