
ప్రధాని నరేంద్ర మోడీ మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 6న బెంగళూరులో ఇండియా ఎనర్జీ వీక్ను ఆయన ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఈవెంట్ను నిర్వహించడం ఇదే మొట్టమొదటిసారి. ఇండియా ఎనర్జీ వీక్ 2023లో మోడీతో పాటు 34 మంది ఇంధన మంత్రులు, 650 మందికి పైగా ఎగ్జిబిటర్లు, 50 మంది సీఈవోలు, 10వేల మందికి పైగా ప్రతినిధులు పాల్గొననున్నారు. ఇక ఈ కార్యక్రమం అనంతరం బెంగళూరులోని తుమకూరులో నిర్వహించే పలు కార్యక్రమాల్లో మోడీ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాని ఫిబ్రవరి 6న ఉదయం కర్నాటకకు చేరుకోనున్నారు. మాదవర సమీపంలోని బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో ప్రధానమంత్రి ఇండియా ఎనర్జీ వీక్ను ప్రారంభించనున్నారు. అనంతరం తుమకూరు జిల్లా గుబ్బి తాలూకాలోని బిడేరహళ్లి కావల్కు.. చేరుకుని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కు చెందిన హెలికాప్టర్ ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయనున్నారు. అదే వేదికపై చిక్కనాయకనహళ్లి-తిప్టూరులో జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు.