- నొవాటెల్లో బీజేపీ ఈవెంట్.. ప్రొఫెషనల్స్తో మీటింగ్
- ఇప్పటికే ఉన్నత విద్యావంతులకు ఇన్విటేషన్స్
- మోదీ తర్వాత రాష్ట్రానికి అమిత్ షా, జేపీ నడ్డా!
హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 27న రాష్ట్రానికి రానున్నారు. ఆ రోజు హైటెక్ సిటీ నోవాటెల్ హోటల్లో బీజేపీ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆ ఈవెంట్లో మోదీ పాల్గొననున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇందులో భాగంగా ప్రొఫెషనల్స్తో ఆయన భేటీ కానున్నారు. ఈ మేరకు ఐటీ ఉద్యోగులు, డాక్టర్స్, ఇంజినీర్స్, లాయర్స్ సహా ఉన్నత విద్యావంతులకు ఇన్విటేషన్స్ పంపించినట్టు తెలిసింది.
పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్నత విద్యావంతుల ఓట్లు కీలకం అవుతాయని భావిస్తున్న బీజేపీ అందుకు అనుగుణంగా వారితో మీటింగులను ఏర్పాటు చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రధాని మోదీ రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి. ప్రధాని మోదీ తర్వాత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా రాష్ట్రానికి రానున్నట్టు తెలుస్తున్నది.