27న తెలంగాణకు ప్రధాని మోదీ!

27న తెలంగాణకు ప్రధాని మోదీ!
  • నొవాటెల్​లో బీజేపీ ఈవెంట్.. ప్రొఫెషనల్స్​తో మీటింగ్ 
  • ఇప్పటికే ఉన్నత విద్యావంతులకు ఇన్విటేషన్స్​
  • మోదీ తర్వాత రాష్ట్రానికి అమిత్​ షా, జేపీ నడ్డా!

హైదరాబాద్​, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 27న రాష్ట్రానికి రానున్నారు. ఆ రోజు హైటెక్​ సిటీ నోవాటెల్​ హోటల్​లో బీజేపీ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆ ఈవెంట్​లో  మోదీ పాల్గొననున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇందులో భాగంగా ప్రొఫెషనల్స్​తో ఆయన భేటీ కానున్నారు. ఈ మేరకు ఐటీ ఉద్యోగులు, డాక్టర్స్, ఇంజినీర్స్, లాయర్స్ సహా ఉన్నత విద్యావంతులకు ఇన్విటేషన్స్​ పంపించినట్టు  తెలిసింది.

పార్లమెంట్​ ఎన్నికల్లో ఉన్నత విద్యావంతుల ఓట్లు కీలకం అవుతాయని భావిస్తున్న బీజేపీ అందుకు అనుగుణంగా వారితో మీటింగులను ఏర్పాటు చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్​ వచ్చిన తర్వాత ప్రధాని మోదీ రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి. ప్రధాని మోదీ తర్వాత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా రాష్ట్రానికి రానున్నట్టు తెలుస్తున్నది.