ప్రధాని మోడీ భద్రతకు రోజుకు రూ.1.62కోట్లు

ప్రధాని మోడీ భద్రతకు రోజుకు రూ.1.62కోట్లు

ప్రధాని మోడీ భద్రతకు రోజుకు రూ.1.62 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు లోక్‌సభకు తెలిపారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి..దేశంలో ఎంతమంది ప్రముఖులకు SPG, CRPF భద్రత కల్పిస్తున్నారన్న డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ప్రశ్నకు కిషన్‌రెడ్డి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలో ఒకే ఒక్క వ్యక్తి ఎస్పీజీ భద్రత పొందుతున్నారంటూ పరోక్షంగా ప్రధాని మోడీ పేరును ప్రస్తావించిన మంత్రి.. ఇందుకోసం రోజుకు దాదాపు 1.62 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు.  దీంతో పాటు మొత్తంగా 56 మంది  VIPలకు CRPF భద్రత కల్పిస్తున్నట్టు కిషన్‌రెడ్డి తెలిపారు.

మొత్తం 3 వేలమంది ప్రత్యేక కమాండోలున్న SPGకి ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ.592.55 కోట్లు కేటాయించారు. గతంలో ఇది రూ.540 కోట్లు కాగా, ఈసారి దానికి 10శాతం పెంచారు. నిన్నమొన్నటి వరకు ప్రధానితోపాటు గాంధీ కుటుంబానికి చెందిన ముగ్గురికి ఎస్పీజీ భద్రత ఉండగా, గతేడాది నవంబరులో కేంద్రం దాన్ని తొలగించింది.