హైదరాబాద్, వెలుగు: మహబూబ్నగర్ పర్యటనలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం రాష్ట్రానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రధానికి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్సీ, తమిళనాడు కో ఇన్చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డితో పాటు రాష్ట్ర బీజేపీ నేతలు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా వివేక్ వెంకట స్వామిని మోదీ ఆప్యాయంగా పలకరించారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో మహబూబ్ నగర్కు ప్రధాని బయలుదేరి వెళ్లారు. పాలమూరు పర్యటన ముగించుకొని సాయంత్రం 5.30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు చేరుకున్న ప్రధానికి అధికారులు, బీజేపీ నేతలు వీడ్కోలు పలికారు.
ప్రభుత్వం తరఫున తలసాని..
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధాని మోదీకి శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. ఆయనతో పాటు సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తదితరులు ఉన్నారు.