
హైదరాబాద్, వెలుగు: పంజాగుట్ట యాక్సిడెంట్ కేసు కీలక మలుపులు తిరుగుతున్నది. బోధన్ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహైల్ తప్పించుకోవడానికి సహకరించారని పంజాగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావుపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు.
అయితే, కేసులో నిందితుడిగా చేర్చిన నాటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు. దీంతో వెస్ట్ జోన్ పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన బోధన్ ఇన్ స్పెక్టర్ ప్రేమ్ కుమార్ కు బెయిల్ లభించింది. ఈ నేపథ్యంలో దుర్గారావు కూడా కోర్టులో లొంగిపోయే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.