భూ సెటిల్​మెంట్ల కేసులో నయీం గ్యాంగ్ సభ్యుడు అరెస్ట్ 

భూ సెటిల్​మెంట్ల కేసులో నయీం గ్యాంగ్ సభ్యుడు అరెస్ట్ 

హన్మకొండ జిల్లా : భూ సెటిల్​మెంట్లు, తుపాకీతో బెదిరింపుల కేసులో నయీం గ్యాంగ్ సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 45 రోజుల క్రితం కేసు నమోదైన తర్వాత తాజాగా నయీం అనుచరుడు ముద్దసాని వేణుగోపాల్ ను అరెస్ట్ చేశారు. ఆరెపల్లిలోని ఓ ల్యాండ్ విషయంలో తుపాకీతో బెదిరింపులకు పాల్పడటంతో జులై 29వ తేదీన వేణుగోపాల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీస్ ​ఆర్ఐ సంపత్​ కుమార్, నయీం అనుచరుడు ముద్దసాని వేణుగోపాల్ సహా మొత్తం10 మందిపై కేసులు నమోదు చేశారు. 20రోజుల క్రితం ఆర్ఐ సంపత్ కుమార్ ను అరెస్ట్​ చేశారు. సోమవారం హన్మకొండలోని తన ఇంటికి వచ్చిన వేణుగోపాల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు వేణుగోపాల్ ను పరకాల సబ్​ జైలుకు తరలించారు.